లోక్ సభలో బిల్లు పెట్టడం హర్షనీయం
1 min read

మిడుతూరు న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టడంతో సంబరాలు మిన్నంటాయి. నంద్యాల జిల్లా మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాయి తిమ్మయ్య ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో లోక్ సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని హెచ్ఎం సాయితిమ్మయ్య అన్నారు.తర్వాత ఉపాధ్యాయులు కేకును కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు రఫీ,శ్రీదేవి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

