లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో.. ‘ మెడికవర్ ’ ఇండియా సీఈఓ
1 min read

కర్నూలు , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిళంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా సీఈఓ హరి కృష్ణ దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు రమేష్ స్వామి మెడికవర్ ఇండియా సీఈఓ హరి కృష్ణ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ హరి కృష్ణ మాట్లాడుతూ అహోబిళం లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. సమాజ ఆరోగ్య సేవల రంగంలో విశేష సేవలందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ ఇండియా సంస్థ ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ఆశీర్వదించాలని దేవున్ని కోరినట్లు సీఈఓ హరి కృష్ణ వెల్లడించారు.


