NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి

1 min read

మార్కులే కొలమానం కాదు…

  • విద్యార్థులకు సూచించిన ప్రముఖ సైకియాట్రిక్​ వైద్యులు డా. రమేష్​​ బాబు

కర్నూలు, న్యూస్​ నేడు : విద్యార్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని సూచించిన ప్రముఖ సైకియాట్రిక్​ వైద్యులు డా. రమేష్​ బాబు… మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని బుధవార పేట బ్రాంచ్​ కేశవ మెమోరియల్​ ఇంగ్లీష్​ మీడియం స్కూల్​ లో ఆరోగ్య భారతి మరియు అభ్యాస వర్ణ  కార్యక్రమం జరిగింది.   ఆరోగ్య భారతి  (ఆంధ్ర, తెలంగాణ & కర్ణాటక) అధిపతి కుమారస్వామి ,  ఏపీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ డా. మోక్షేశ్వరుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యులు డా. రమేష్​ బాబు మాట్లాడుతూ మార్కులు తక్కువగా వచ్చాయని ఆందోళన చెందవద్దని, జీవితంలో విజయం సాధించాలంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదన్నారు.  ఈ సందర్భంగా మెడికల్​ ఆకాంజిస్ట్​ ఎండి,డిఎం. డా. శివ కృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్​ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, ఆధునిక ప్రపంచంలో క్యాన్సర్​ కు చికిత్స సాధ్యమేనన్నారు. మూడు దశల్లో ఉన్న క్యాన్సర్​ ను నియంత్రించే అవకాశం ఉందని, కానీ నాల్గవ దశకు చేరితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్నారు. ఆ తరువాత ప్రముఖ సైకియాట్రిక్​ వైద్యులు డా. రమేష్​ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. మానసిక రుగ్మతలు, లక్షణాలు, చికిత్స, నివారణ తదితర అంశాల గురించి డా. రమేష్​ బాబు క్షుణ్ణంగా వివరించారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *