కాంస్య పతకాలతో మెరిసిన ఏపీ హ్యాండ్ బాల్ జట్లు
1 min read
కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్ నేడు: తెలంగాణ రాష్ట్రం హనుమకొండలో జరిగిన సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ మహిళా పురుషుల జట్లు మూడో స్థానంలోకి కాంక్ష పతకాలతో మెరిశారు.ఏప్రిల్ 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్లు కాంక్ష పతకాలు సాధించడం పట్ల హ్యాండ్ బాల్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తూ పథక విజేతలను రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. అలాగే మరో రెండు నెలల్లో నిర్వహించే జాతీయ స్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు పంపుతున్నట్లు ఆయన వివరించారు.

