సమాచార హక్కు చట్టం పై అవగాహన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా సహకార అధికారి, కర్నూలు వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు జిల్లా సహకార అధికారి శ్రీ జి.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో 23.7.2025 వ తేదీన జరిగినది. అందులో సహకార శాఖ విశ్రాంత అధికారులు జి. గోపీ కృష్ణ, మరియు బి. మల్లికార్జున గౌడ్ మొదటి అప్పీలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 పై పూర్తి అవగాహన కల్పించారు.

