ఇంటింటా భగవద్గీత – ప్రతినోట భగవద్గీత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భగవద్గీతను ప్రతి సామాన్యుని దగ్గరకి తీసుకుపోవుటకు కర్నూలు నగరం, ఎన్.ఆర్. పేటలోని, గీతాప్రచార ధామం లో ప్రతి ఆదివారం ఉదయం 08-30 నుండి 09-30 గంటల వరకు “ఇంటింటా భగవద్గీత – ప్రతినోట భగవద్గీత” అనే నినాధంతో ఉచితంగా భగవద్గీత అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళానిలయం వ్యవస్థాపకులు బి. నాగమల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వామి గీతాప్రచార సంఘఘం అద్యక్షులు, గీతారత్న డి.వి. రమణ, ప్రచార కార్యదర్శి మహాబలేశ్, వివేకానంద సేవా సమితి కర్నూలు నగర బాధ్యులు, అనంత సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అనంత అనిల్ కుమార్ తదితరులచే ప్రారంబిస్తున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరములకు 9441573893 ద్వారా తెలుసుకోగలరు.

