NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శనగ ..మొక్కజొన్న , మల్లె, కూరగాయలు పంటలను పరిశీలించిన కలెక్టర్​

1 min read

కల్లూరు, న్యూస్​ నేడు:  కల్లూరు మండలం లోని బస్తిపాడు, గ్రామంలో శనగ మొక్కజొన్న , మల్లె,మరియు కూరగాయలు పంటలను  కలెక్టర్  డా. ఎ.సిరి  ఐఏఎస్​  పరిశీలించడం జరిగింది.  శనగ పంట సాగు, ప్రస్తుత ఉన్న పంటల మద్దతు ధరల గురించి బస్తిపాడు గ్రామ రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి. ఎల్.వరలక్ష్మీ ,  ఆర్డీఓ ,మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు, మండల తహశీల్దార్ ,మండల ఉద్యానవన అధికారి, గ్రామ సర్పంచ్ , ఎ.ఈ. ఓ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది.

About Author