రీ సర్వే ఫీల్డ్ విజిట్ చేసిన డిప్యూటీ డైరెక్టర్
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికోన గ్రామంలో జరిగిన భూముల రీ సర్వే పనులను పర్యవేక్షించడానికి రీ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సూర్యారావు ఫీల్డ్ విజిట్ చేశారు. పందికోన గ్రామం నందు జరిగిన భూముల రీ సర్వే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో జరిగిన రి సర్వే వివరాలను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ సూర్య రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ముని కన్నన్ సంతృప్తి వ్యక్తం చేశారు. డిఐఓఎస్ దేవేంద్రయ్య స్వామి మండల సర్వేయర్ గాదిలింగన్న వారి వెంట ఉన్నారు.

