NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు

1 min read

సుమారు1667 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో ప్రసాద వితరణ

వివిధ సేవల రూపేణ రూ:1,87,747/-లు ఆదాయం సమకూరినది

19న,శ్రీ పరాభవ నామసంవత్సర ఉగాది నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమం 

కార్యనిర్వహణాధికారిణి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 1667 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.4-30 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.1,87,745/-లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు  ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెల్పినారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉగాది ఆహ్వానంఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ది.19.03.2026 ఉదయం గం.09.00 ల నుండి “శ్రీ పరాభవ నామసంవత్సర” “ఉగాది” “పంచాంగ శ్రవణo”  కార్యక్రమం జరుగును. కావున  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ కార్యక్రమం నందు పాల్గొని శ్రీ స్వామి వారి తీర్ధ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము.

About Author