ఎరువుల దుఖాణాలు జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: కల్లూరు మండలము లోని ఎరువుల దుకాణములు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి ఎల్ వరలక్ష్మీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.కల్లూరు మండలములోని సాయి కృప ఏజెన్సీస్ మరియు విజయ లక్ష్మీ ఏజెన్సీస్ అను ఎరువుల దుకాణములలో తనిఖీలు నిర్వహించి, యూరియా స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు. ఈ పాస్ స్టాక్ గ్రౌండ్ బ్యాలన్స్ లను పరిశీలించి 2,93,000 రూపాయలకు స్టాప్ సేల్ ఇచ్చారు,అలాగే కర్నూలు మండలము లోని మన గ్రోమోర్ సెంటర్ నందు తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించి యూరియా వివరాలను ఫ్లెక్సీలను పరిశీలించారు.ఇందులో భాగంగా వ్యవసాయ సహాయ సంచాలకులు (రె) సాలు రెడ్డి కర్నూలు వారు, మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు పాల్గొనడం జరిగినది.

