శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయని కి శాశ్వత అన్నదానానికి విరాళం
1 min read
రూ.1,01,115/-లు ఆలయ పర్యవేక్షకులు కె.రంగారావు చేతుల మీదుగా శ్రీ స్వామి వారికి అందజేత
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామం నందు వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానముకు సిద్దాంతం వాస్తవ్యులు కసుగుర్తి వెంకటేశ్వర్లు వారి కుటుంభ సభ్యులు శ్రీ స్వామి వారి దేవస్థానం నందు ప్రతీ రోజు జరుగుచున్న శాశ్వత నిత్య అన్నదానమునకు రూ.1,01,115/-లు ఆలయ పర్యవేక్షకులు శ్రీ కె.రంగారావు చేతుల మీదుగా శ్రీ స్వామి వారికి అందజేసినారు అని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు శ్రీ రాజాన సత్యనారాయణ మరియు అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేశారు.


