NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం

1 min read

వైసిపి నాయకులు మూలింటి దివాకర్ రెడ్డి

ప్యాపిలి న్యూస్ నేడు: మృతిని కుటుంబానికి అండగా ఉంటామని ఆర్థిక సహాయాన్ని ఎన్ .రాచర్ల వైసిపి నాయకులు మూలింటి దివాకర్ రెడ్డి మానవ ధృపవంతో ఐదు వేల రూపాయలను దహన సంస్కారల  కోసం అందజేశారు. ప్యాపిలి మండలంలోని ఎన్ రాచర్ల గ్రామానికి చెందిన హరిజన వాడ కు చెందిన బొంది మదు (37) అనారోగ్యంతో కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  సోమవారం మృతి చెందినట్లు కాలనీ వాసులు గ్రామస్తులు తెలిపారు. అతనికి భార్య మాధవి, ఐదు సంవత్సరల కూతురు, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. బొంది మదు ఆరోగ్యం కోసం అప్పుల పాలై దీనస్థితిలో వారి కుటుంబం వీధిలో పడింది. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు.

About Author