ఎందరికో.. పునర్జీవం..
1 min read

21 ఏళ్ల యువకుడికి బ్రెయిన్ డెడ్..
- ‘జీవన్ధాన్ –ఏపీ’ ద్వారా అవయవదానం
- – గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్,
కర్నూలు జీజీహెచ్కు అవయవాల తరలింపు…
- బాధిత కుటుంబీకులు, బంధువులను అభినందించిన మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం
కర్నూలు, న్యూస్ నేడు:నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త బానకచర్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు మొలక తరుణ్ బ్రెయిడ్ డెడ్ తో మృతి చెందాడు. కర్నూలు నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఈ ఏడాది జూన్ మాసంలో జీవన్ ధాన్ – ఏపీ అనుమతి పొందింది. ఈ క్రమంలో తరుణ్ కుటుంబీకులను, బంధువులను మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం అవయదానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించి… ఒప్పించారు. దీంతో మెడికవర్ లో జీవన్ ధాన్ – ఏపీ ద్వారా ఫోరిన్ సిక్ మెడిసిన్ హెచ్ ఓడి డా. సాయి సుధీర్ నేతృత్వంలో మెడికవర్ ఆస్పత్రి థియేటర్లో అవయవ మార్పిడి శస్ర్త చికిత్స నిపుణులు, యురాలజిస్ట్ డా. అబ్దుల్ సమద్ నెఫ్రాలజి డా. సిద్ధార్థ హెరురు, అనస్థీయ వైద్యులు డా. ప్రవీన్ సహాయంతో తరుణ్ అవయవాలు సేకరించి… గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్, కర్నూలు జీజీహెచ్కు , జీవన్ ధాన్ – ఏపీ ద్వారా అనుమతి పొందిన ఆస్పత్రులకు తరలించారు.
అవయవ దానం.. గొప్ప నిర్ణయం..
బాధితుడి తల్లిదండ్రులు మొలక రాజు, ఈరమ్మ, బంధువులు మొలక తరుణ్ అవయవదానం కు అంగీకరించడం అభినందించదగ్గ విషయమని, తరుణ్ ఎందరికో పునర్ఝీవం ఇచ్చినట్లవుతుందన్నారు మెడికవర్ ఆస్పత్రి హెచ్ ఓడి మహేశ్వర రెడ్డి . ఈ సందర్భంగా తరుణ్ తల్లిదండ్రులను ఇన్చార్జ్ డీఎం అండ్ హెచ్ ఓ డా. భాస్కర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఆ తరువాత తరుణ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.



