ఆ నేరస్థుల్ని క్షమించొద్దు !
1 min read

పల్లెవెలుగువెబ్ : పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం చట్టానికి పట్టి ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం బీర్భూమ్ గ్రామంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు.

