భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు
1 min read

చిన్న కార్యకర్తను పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పం ఉన్న నాయకుడు లోకేష్ బాబు
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామం” — తెదేపా యువనేత శ్రీ బోడే వెంకట్రామ్
పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో,ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ ఆదేశాల మేరకు భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు దక్కిన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు…యువనేత శ్రీ బోడే వెంకట్రామ్ నాయకత్వంలో నియోజకవర్గ తెదేపా శ్రేణులు భారీగా తరలి వచ్చి కేక్ కటింగ్ చేసి,ఆనందాన్ని వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ —యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకం నింపిన నాయకుడు లోకేష్, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని తెలిపారు.“కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతంతో క్షేత్ర స్థాయి కార్యకర్తకు గుర్తింపు తీసుకొచ్చే విధంగా పార్టీ నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్ గారేనని కొనియాడారు…పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ, శిక్షణా కార్యక్రమాల ద్వారా నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్న లోకేష్ విజన్నే ఈ రోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలకు కారణమని స్పష్టం చేశారు.ఇకపై లోకేష్ నాయకత్వంలో క్షేత్ర స్థాయి కార్యకర్తలతో కలసి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ సీనియర్ నాయకులు దేవినేని రాజా తుమ్మలపల్లి హరికృష్ణ జంపాన గురునాథం జంపని వెంకటేశ్వరరావు అనంతనేని ఆజాద్ దొనేపూడి రవి కిరణ్ బొంగరాల అబ్రహం నేరుసు సతీష్. నేరుసు రాజ్యలక్ష్మి యార్లగడ్డ సుచిత్ర మేడసాని రత్నకుమారి మల్లంపాటి విజయలక్ష్మి దోనేపూడి రమాదేవి బొప్పన నీరజ షేక్ సలీం మురళి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

