NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్షేత్రస్ధాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజి, ఎస్పీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగొట్లలో మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాసు  పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు   పాల్గొన్నారు.    ముఖ్యమంత్రి  పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ ,  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు  క్షేత్రస్ధాయిలో భద్రతా ఏర్పాట్లను  పర్యవేక్షించారు.ఈ సంధర్బంగా పోలీసు అధికారులు తగిన భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డిఐజి  , కర్నూల్ ఎస్పీ  తెలియజేశారు. కలుగొట్ల హెలిప్యాడ్ వద్ద  రాష్ట్ర ముఖ్యమంత్రి ని  కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చo ను అందజేసి స్వాగతం పలికారు.

About Author