పండుగ మూగీయడంతో తిరిగి పట్టణాలకు వలస కూలీలు పయనం..
1 min read

సంక్రాంతి పండుగకు పిల్లాపాపలతో సొంతూర్లకు చేరుకున్న వలస కూలీలు
కౌతాళం, న్యూస్ నేడు: ప్రభుత్వాలు ఎన్ని మారిన వలస కూలీలు జీవితాలు మాత్రం మారడం లేదు.. పొట్టకూటి కోసం చదువుకునే పిల్లలను సైతం వెంటపెట్టుకొని వలస బాట పడుతున్నారు.. సుదూర ప్రాంతాలకు మరియు పట్టణాలకు వలస బాట పట్టారు. ఉన్న ఊళ్లో పనులు లేక పెద్ద ఎత్తున కౌతాళంలో ఉప్పర కాలనీవాసులు మొత్తం బయలుదేరారు. ఇప్పటికైనా. ప్రభుత్వం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన నిత్యం వలసలు నిలయంగా మారిన కౌతాళం ,కోసిగి, పెద్ద కడుబూరు, మంత్రాలయం, మండలాలను గుర్తించి వలసలు నివారించేందుకు ఉపాధి పనులు గ్రామాల్లో బలంగా కల్పించాలన్నారు.

