ప్రశాంతంగా మోహరం పండుగ..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో మొహరం పండుగ ప్రశాంతంగా జరిగింది. మండలంలోని మిడుతూరు, 49 బన్నూరు, చౌటుకూరు,దేవనూరు,నాగలూటి,ఉప్పలదడియ, కలమందల పాడు తదితర గ్రామాల్లో పండుగను భక్తి శ్రద్దలు నడుమ వివిధ గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.పీర్ల దగ్గర మహిళలు చిన్నారులు ప్రజలు బంధువులు అధిక సంఖ్యలో టెంకాయలు కొడుతూ ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు.ఈ మొహరం పండుగలో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ మరియు సిబ్బంది గ్రామాల్లో పర్యవేక్షించారు.

