పీఎం శ్రీ నిధులు సద్వినియోగం సక్రమంగా ఉపయోగించాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సైమాట్ డైరెక్టర్ వి .మస్తానయ్య ,కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శామ్యూల్ పాల్ కర్నూలు డిఈఓ ఆఫీసు లో, పీఎం శ్రీ స్కూల్స్ పురోగతి పైన సమీక్ష నిర్వహించడం జరిగింది పీఎం శ్రీ స్కూల్స్ కు మరియు ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన నిధులను సక్రమమైన రీతిలో వినియోగించుకొని బిల్లులు సత్వరమే అప్లోడ్ చేయవలసిందిగా అందరూ ప్రధాన ఉపాధ్యాయులకు మండలం విద్యాధికారులకు సమీక్ష నిర్వహించి పురోగతి పైన దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది, మండల విద్యాధికారులు తమ పర్యవేక్షణలు చేసే ప్రతి చోట విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించాలన్నారు సమీక్ష సమావేశంలోపాల్గొన్న ఈఈ శ్రీనివాసులు గ, అసిస్టెట్ ఇంజనీర్స్ , సెక్టోరియల్ ,అధికారులు తో ఆయన సంభాషించారు.ఆయన ప్రసంగంలో సివిల్ వర్క్స్ వెంటనే కంప్లీట్ చేయాలన్నారు వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో సక్రమమైన పద్ధతిలో వినియోగించి కావాలన్నారు,ఉపాధ్యాయ తరగతుల పర్యవేక్షణ, విద్యా కార్యకలాపాలు, ఎస్ఎంసి సభ్యులతో సంబంధాలు, అభ్యాస ఫలితాలు, మనం నిర్మించే స్కూల్ భవనాలు భావితరాలకు బంగారు బాట వేయాలన్నారు ,మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతులను కనుగొనడం మరియు నెమ్మదిగా నేర్చుకునేవారికి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి ఈ సమీక్ష సమావేశ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ సెక్టోరియల్ ఆఫీసర్లు, డాక్టర్ షేక్ రఫీ, డాక్టర్ వై ధనరాజ్, ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ సురేంద్ర బాపూజీ, జీసిడీఓ స్నేహలత , సమగ్ర శిక్ష ఈఈ శ్రీనివాసులు, ఏఎస్ఓ మల్లయ్య పాల్గొన్నారు.

