తెదేపా తోనే కుమ్మరులకు రాజకీయ, సామాజిక గుర్తింపు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ తోనే కుమ్మరులకు రాజకీయ మరియు సామాజిక గుర్తింపుఆంధ్రప్రదేశ్ కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ అన్నారు.ఈసందర్భంగా నంద్యాల ఎంపి శబరిని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలోని కుమ్మరులకు రాబోయే స్టానిక సంస్థల ఎన్నికలలో తగిన రాజకీయ ప్రదాన్యత కల్పిoచాలని మరియు కుల అభివృద్దికి తోడ్పాటు అందజేయాలని వారు కోరారు.అందుకు ఎంపి శబరమ్మ సానుకులంగా స్పందిస్తు యువత రాజకీయాలలోకి రావాలని వారికి తగిన ప్రదాన్యత ఉంటుందని కుమ్మరుల కుల వృత్తిని ఆదుకోవడానికి ఆదరణ 3.0 కింద ఎలక్ట్రానిక్ పరికరాలు ,50 సంవత్సరంలు దాటి కులవృత్తి లో కొనసాగుతున్న కుమ్మరులకు పెన్షన్ అవకాశం కల్పించాలని కోరారు.ఎంపీ స్పందిస్తూ బి సీ లకు కూటమి ప్రభుత్వం లో న్యాయం జరుగుతుంది అని ముక్యంగా కుమ్మరులకు తగిన న్యాయం జరుగుతుంద అని సానుకూలంగా స్పందించడం జరిగిందని కుమ్మరి సుధాకర్ తెలిపారు.

