గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలి
1 min read

సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర
పత్తికొండ, న్యూస్ నేడు: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర పంచాయతీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సీనియర్ అసిస్టెంట్ చెన్నయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలని, జీవో నెంబర్ 132, 680, 142 లను వెంటనే అమలు చేయాలని, టెండర్లు రద్దు చేయాలని ఆయన కోరారు. గ్రామపంచాయతీ కార్మికులు సెప్టెంబ 18వ తేదీన మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడతామని, అలాగే 25వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచకున్నా, పని భారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా మోపుతుందని ఈ మధ్యకాలంలో ఆన్లైన్ సిస్టం ఐ వి ఆర్ ఎస్ కాల్స్ పేరుతో క్షణం తీరిక లేకుండా పని భారం మోపడం సమంజసం కాదని అన్నారు. వెంటనే కార్మికులకు జీతాలు పెంచాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు ఉధృతం చేస్తామనే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రామపంచాయతీ నాయకులు నరసన్న, సతీష్, పాముల రంగన్న, పెద్ద రంగన్న, ఆవుల రామాంజి, ధనలక్ష్మి, పెద్ద రంగమ్మ, ఆవుల రంగనాథు, ఈశ్వరయ్య, కె. ఆంజనేయులు, తదితరులు పాల్గొంటున్నారు.

