NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలల బస్సులు కండిషన్ లో ఉండాలి

1 min read

ఆత్మకూరు ఆర్టీఓ ఏఎస్ఎన్ రెడ్డి..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  :ప్రైవేటు పాఠశాలల బస్సులు కండీషన్ లో ఉండాలని ఆత్మకూరు ఆర్టీవో ఏ.వెంకట సత్య నారాయణ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పాఠశాల నాలుగు బస్సులను శనివారం ఉదయం ఆర్టీవో ఆకస్మిక తనిఖీ చేశారు. బస్సులు కండిషన్ లో ఉన్నాయా లేదా అని పరిశీలించారు.తర్వాత ఆర్టీవో మాట్లాడుతూ ఇకనుంచి అన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపైనే ఆపీ తరచుగా తనిఖీలు చేస్తామని అంతే కాకుండా డ్రైవర్ కు లైసెన్ ఉండాలి.ఇండికేటర్లు,లైట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్,అటెండర్, ఫైర్ సేఫ్టీ మరియు బస్సుకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే తనిఖీలు చేస్తున్నామని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పాఠశాలల యాజమాన్యం చూసుకోవాలని అవసరం ఉందని యాజమాన్యం ఎప్పటికప్పుడు బస్సులను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆర్టీవో ఏఎస్ఎన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.శివ కిరణ్ పాల్గొన్నారు.

About Author