కారణజన్ముడు భారత ప్రధాని నరేంద్ర మోడీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణజన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ తన రాజకీయ చతురతతో దేశాన్ని పురోగవృద్ధి దిశలో పయనింప చేస్తున్నారనీ అన్నారు. కష్టనష్టాలతో కొట్టి మిట్టాడుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకునేలా కృషి చేశారని ఆయన కొనియాడారు. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఏమి చెప్పినా ఎదురు చెప్పేవారు లేకుండా తల ఊపే పరిస్థితి ఉండేదని, కానీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రోజులు పోయి స్వశక్తితో ఎవరినైనా ఎదిరించగలిగే స్థాయికి భారతదేశం ఎదిగిందని టీజీ అన్నారు. కరోనా కష్టకాలంలో దేశాన్ని అంతటిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ మహమ్మారి నుంచి భారతదేశాన్ని కాక ప్రపంచాన్ని అంతటినీ కాపాడిన వ్యక్తి మోడీ యేననీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు పోలంకి రామస్వామి, మాధవిలత తదితరులు పాల్గొన్నారు.

