అత్యధిక జీతం అందుకున్న ఉద్యోగి ఈయనే !
1 min read

పల్లెవెలుగు వెబ్ : గత ఆర్థిక సంవత్సరం అగ్రస్థానంలో ఉన్న మూడు ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా ?. ఆయనే ఆదిత్య పూరి. హెచ్ డీఎఫ్ సి బ్యాంకు సీఈవో. 2020-21లో పదవి విరమణ చేసిన ఆయన.. మొత్తం 13.82కోట్ల వేతనం అందుకున్నాడు. ఆయన వారసుడిగా హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీషన్ 4.77 కోట్ల స్థూల వేతనాన్ని పొందారు. ఐసిఐసిఐ బ్యాంకు ఎండీ, సీఈవో సందీప్ భక్షి స్థిర వేతనంలో బేసిక్, అదనపు అలవెన్సులు స్వచ్చందంగా వదులుకున్నారు.

