NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నాం.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

22వ వార్డులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భ‌ర‌త్

ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం ఏడాదిలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివ‌రించిన మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. కర్నూలు నగరంలోని 22వ వార్డు అరోరా న‌గ‌ర్‌లో ఆయ‌న సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప‌ర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజ‌ల‌తో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివ‌రించారు. ఏ ఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. అర్హులంద‌రికీ పింఛ‌న్లు 1వ తేదీనే అందిస్తున్నామ‌న్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజ‌ల కోసం అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనుల వల్ల ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం మరో రెండు దశాబ్దాల పాటు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుందన్నారు.

About Author