మామిడి రైతులకు ఎగుమతి దారులకు సమన్వయం కల్పించాం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఓర్వకల్ మండలంలో గుడుంబాయి తండా గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి ఎగుమతి దారులను మామిడి తోటలను సందర్శింప చేసి వాటిని ఎగుమతి చేసేటట్టు రైతులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీ రాజాకృష్ణారెడ్డి మరియు సాంకేతిక ఉద్యాన అధికారి మదన్మోహన్, రైతు సేవ కేంద్ర సిబ్బంది శశిదేవి, వేణు రైతులు మరియు ఎగుమతి దారులు శ్రీనివాస రావు పాల్గొన్నారు. నాణ్యత ఉన్న మామిడి పండ్లను రైతులే స్వయంగా ఎగుమతి చేసేటట్టు రైతులకు ఎగుమతి దారులకు సమన్వయం కల్పించడం జరిగినది .కావున ఆసక్తిగల రైతులు ఎగుమతి చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న రైతు సేవ కేంద్ర సిబ్బందిని కానీ ఉద్యాన శాఖను సంప్రదించండి.

