సామాన్య ప్రజలకు సులభతరంగా ఉండే ధరలకే ప్లాట్స్ కేటాయిస్తాము
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బనవాసి సమీపంలో ఎన్.టి.ఆర్ స్మార్ట్ సిటి పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండే చౌక ధరతో నిర్మాణం చేపట్టేందుకు కుడా పరిధిలోని ఈ స్థలంలో స్థానిక శాసనసభ్యులు గౌ,, బి.వి.జయనాగేశ్వర రెడ్డి తో సంప్రదించి తేది ఖరారు చేస్తామని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ డిప్ ద్వారానే ప్లాట్స్ కేటాయించబడతాయి. ఇక్కడ నీటి సౌకర్యం కోసం పైపు లైన్ పనులు వేగవంతంగా చేపట్టడం జరుగుతుంది. 18 ఎకరాల కుడా పరిధిలోని స్థలములో సామాన్య ప్రజలకు సులభతరంగా ఉండే ధరలకే ప్లాట్స్ కేటాయిస్తాము. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేని విధంగా ఉంటాయి. కనుక ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విఘప్తి చేస్తున్నా.

