జగన్ వారసుడెవరు ?
1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబుకు వయస్సు అయిపోయిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఫరూక్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, బాలకృష్ణకు వారసులున్నారని.. జగన్కు వారసుడు ఎవరూ లేరన్నారు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు ఉన్నారని తెలిపారు. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించుకోవాలని ఫరూక్ హితవుపలికారు.

