ఆదోని జిల్లా కావాలని జేఏసీ తలపెట్టిన బంద్ కు మద్దతు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం మరియు ఆలూరు పట్టణంలో ఆదోని జిల్లా కావాలని జేఏసీ తలపెట్టిన బంద్ కు మద్దతూ తెలిపిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి .ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ…ఆదోని ని జిల్లాను చేస్తేనే చుట్టూ పక్కన ఉన్న 4నియోజకవర్గలుకు ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గలు అభివృద్ధి చెండుతాయి అన్నారు.ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఆదోని అయితే దగ్గర అవుతుంది, కర్నూల్ 120 కీ.మీ అవుతుంది అన్నారు.ఆదోని జిల్లా చేయాలని మా నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి కి దృష్టికి తీసుకొని పోతామని అన్నారు.ఆదోని జిల్లా చేయాలని జేఏసి తలపెట్టిన బంద్ కు అన్ని వామపక్ష పార్టీలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఆదోని జిల్లా చేసేంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొనారు.


