PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

15న ఎమ్మెల్యే జయసూర్య ఫిర్యాదుల స్వీకరణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఈనెల 15వ తేదీ(మంగళవారం) న మిడుతూరు మండల కేంద్రంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని ఎంపీడీఓ పి దశరథ రామయ్య తెలిపారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం దగ్గర ఈ నెల 15వ తేదీ ఉ 10 గంటల నుండి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) కార్యక్రమం ద్వారా మండలంలో ఉన్న ప్రజలు ఏఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి గాను స్వయంగా ఎమ్మెల్యే ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారని ఎంపీడీవో తెలిపారు.ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ శాఖల మండల అధికారులు మరియు పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలు తప్పనిసరిగా హాజరు కావాలని అంతే కాకుండా ఈ గ్రీవెన్స్ గురించి గ్రామాల్లో ప్రజలకు తెలిసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకోవాలని ఎంపీడీవో పత్రికా ముఖంగా తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *