PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 2.. ఈ శనివారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించే ఛానల్ జీ తెలుగు. నటీనటులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ను ఘనంగా నిర్వహించింది. టాలీవుడ్ ప్రముఖులు, జీ తెలుగు తారల సందడితో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమం మొదటి భాగం ఇప్పటికే ప్రసారం కాగా, రెండో భాగాన్ని ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ పార్ట్-2ను ఈ ఆదివారం మీముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. అలరించే ప్రదర్శనలు, హృదయాన్ని హత్తుకునే క్షణాలు, మరపురాని అనుభవాలతో తెలుగు టెలివిజన్ స్ఫూర్తిని ప్రతిబింబించే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్-2 అక్టోబర్ 19 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 మరోసారి వారిని అలరించేందుకు సిద్ధమైంది. ఎనర్జిటిక్ యాంకర్స్ సుధీర్, వర్షిణి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆషిక, సౌందర్యల అద్భుతమైన ప్రదర్శనతో అన్ని సీరియల్ కుటుంబాల ప్రత్యేక ఎంట్రీతో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేఘసందేశం సీరియల్ నటి భూమి నృత్య ప్రదర్శన ఈవెంట్కి మరింత సంప్రదాయ కళను తీసుకొచ్చింది.యాంకర్వర్షిణి జీ హీరోలందరితో కలిసి అద్భుతమైన మాస్ డాన్స్తో వీక్షకుల్లో ఉత్సాహంనింపింది. టాలీవుడ్ లవ్లీ పెయిర్ తరుణ్,  శ్రియశరణ్ ఎంట్రీ షో మరింత ఆహ్లాదంగా సాగింది. శ్రియ సినిమాల్లోని ప్రసిద్ధిగాంచినసన్నివేశాలను డ్రామా జూనియర్స్ పిల్లలు రీక్రియేట్ చేసి నవ్వులు పూయించారు.తరుణ్తో జీ తెలుగు తారల అల్లరి, శ్రియ డాన్స్ఫెర్ఫామెన్స్ షోకి హైలెట్గా నిలిచాయి. ఉత్తేజకరమైన, వినోదభరితమైన, భావోద్వేగభరితమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మీప్రియమైన తారలు వారి అసాధారణ ప్రతిభ,సృజనాత్మకత, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ప్రతిష్ఠాత్మక జీకుటుంబం అవార్డులు 2024 అందుకున్నక్షణాల్లో జీ తెలుగు వేదికగా మీరూ భాగంకండి!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *