PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం…మంత్రి

1 min read

జిల్లా ఇన్చార్జి మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన..

జిల్లా కలెక్టర్, ఎస్పీ , జాయింట్ కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు..

పారిశ్రామిక రంగం వైపు ప్రతి ఒక్కరo పని చేద్దాం

కొల్లేరు ప్రాంత ప్రజలకు, అభివృద్ధికి మరింత కృషి చేస్తాం

జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాలు,జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. ఏలూరు జిల్లాను వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు  అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో పయనింపచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషిచేద్దామన్నారు. పోలవరం ప్రాజెక్ట్, కొల్లేరు ప్రాంతం ముంపు సమస్య, తదితర అంశాలను ఇంచార్జి మంత్రి దృష్టికి మంత్రి కొలుసు పార్థసారథి తీసుకువెళ్లారు. కొల్లేరూ ప్రాంత ప్రజల అభివృద్ధికి మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అందరి సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి , ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్,  ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య ,పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు,జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ,  ప్రభృతులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *