గ్రామ ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఝాన్సీ..
1 min read

న్యూస్ నేడు కర్నూలు: కర్నూల్ మండలం పి. రుద్రవరం గ్రామం సచివాలయం సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని గ్రామ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయంలో సిబ్బంది పనితీరు బాగుందని తెలిపారు. గ్రామ ప్రజలు సమస్యలతో సచివాలయం వచ్చిన వారికి సానుకూలంగా స్పందించి ఓపికతో వారికి వివరణ ఇచ్చి వాటిని పరిష్కరిస్తున్నారు సచివాలయం సిబ్బంది. ఈ సేవలో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ ఝాన్సీ గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.


