వికలాంగులకు.. వృద్ధులకు పింఛన్ పంపిణీ
1 min read

హోళగుందన్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతుల వర్గాలకు అలాగే ప్రజలకు అండగా ఉంటూ చరిత్రత్మక నిర్ణయం తో వికలాంగులకు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రతినెల ఒకటో తారీకు వచ్చిందంటే ప్రజల వద్దకే అధికారులు నాయకులు యువకులు కార్యకర్తలు పోయి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జనవరి ఒకటో తారీకు ఇవ్వాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వనికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేయడం జరిగింది ఈరోజు హొళగుందా మండలంలోని ఎండి హల్లి మరియు ఇంగలదాహల్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడు ఉంటుందని ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో యం.డి. హళ్లి సర్పంచ్ సుధాకర్, ఇంగలదాహల్ టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, యం.డి. హళ్లి టీడీపీ నాయకులు wua వైస్ చైర్మన్ వీరనగప్ప, టీడీపీ గ్రామ అధ్యక్షులు ఈరన్న, డీలర్ నాగరాజు,టీడీపీ సీనియర్ నాయకులు పెద్ద రంగారెడ్డి, లక్ష్మన్న ఎస్ఎంసి చైర్మన్ పెద్ద కొండయ్య,టిసి లు చంద్ర, వీరుపాక్షి స్వామి,దాసప్ప, గదిలింగప్ప, అశోక్, వీరేష్ స్వామి, శరణ, పిఎస్ లోకేష్ వెల్ఫేర్ అసిస్టెంట్ రాఘవేంద్ర,శీను, మల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

