మహాశివరాత్రి పర్వదినాన 5,వేల మందికి అన్న సమారాధన
1 min read

ప్రతి ఏటా రామయ్య పేట భక్తుల ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం మండలం రామయ్య పేట మహాశివరాత్రి సందర్భంగా మహానందీశ్వర స్వామి గుడి వద్ద 5000 మందికి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమం స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రతి ఏటా సేవా దృక్పథంతో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, కలిగట్ల సీతాదేవి, చెక్క వీర సుబ్బారావు వెంకటేశ్వరరావు, పోతుల చిరంజీవి రావు, మద్దు నగేష్, చింత సుబ్బారావు, గ్రంధి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పోలవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


