NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదింట ‘ షేక్​ మరియా’ ప్రతిభ

1 min read

ఇంటర్​ ప్రథమ బైపీసీలో అత్యుత్తమ మార్కులు

  • జిల్లాలో టాప్​ –3 లో నిలిచిన విద్యార్థిని
  • అభినందించిన ఎస్​.ఆర్​. కళాశాల యాజమాన్యం

 కర్నూలు ఎడ్యుకేషన్​, న్యూస్​ నేడు : పేదింట కుటుంబంలో జన్మించిన షేక్​ మరియా ఇంటర్​ ప్రథమ  సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి… కళాశాలకు.. జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చింది.  కర్నూలు నగరంలోని గడ్డావీధికి చెందిన షేక్​ మన్జూర్​ అహ్మద్​  ఓ మసీదులో ప్రార్థన చేసే ఇమామ్​. ఆయన కూతురు షేక్​ మరియా సదాఫ్​  స్థానిక విద్యా నగర్​ లోని ఎస్​. ఆర్​. కళాశాలలో  ఇంటర్మిడియట్​ చదువుతోంది.  రెండు రోజుల క్రితం వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం​ ఫలితాలలో షేక్​ మరియా సదాఫ్​  బైపీసీ లో 450/455 మార్కులు సాధించి.. కర్నూలు జిల్లాలో మూడవ స్థానంలో నిలిచింది.  కళాశాలలో మొదటి ర్యాంకు సాధించింది.  క్రమ శిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతో ఎప్పటికప్పుడు సబ్జెక్టును చదువుతూ.. నేర్చుకోవాలని, ఆధునిక టెక్నాలజీని కూడా పరీక్షల సమయంలో ఉపయోగించుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించగలరని ఈ సందర్భంగా ఎస్​ ఆర్​ కళాశాల విద్యా నగర్​ బ్రాంచ్​ ప్రిన్సిపల్​ రవీంద్ర గౌడ్​  , వైస్​ ప్రిన్సిపల్​ ఇమ్రాన్​ తెలిపారు. జిల్లాలోని ఇతర కళాశాలలకు ధీటుగా తమ విద్యార్థిని  సత్ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్​. ఆర్​. కళాశాల  జోనల్​ ఇన్​చార్జ్​ టి. రఘువీర్​ పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *