ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ
1 min read

మహానంది, న్యూస్ నేడు: ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులు తనిఖీలు బుధవారం చేపట్టినట్లు విశ్వాసనీయ సమాచారం. ఆకస్మిక ఏసీబీ దాడులతో కార్యాలయ అధికారులు కంగు తిన్నట్లు తెలుస్తుంది. కమిషన్ల పర్వం కొనసాగుతుందని ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

