సర్వ శాంతి విశ్వ శాంతి -బసవ జయంతి వేడుకలు అభినందనీయం
1 min read

-వీర శైవ లింగాయత్ చైర్ పర్సన్
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరులో ఏప్రిల్ 20 న సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ ఇంటి ఆవరణలో జరగబోవు ‘సర్వ శాంతి-విశ్వ శాంతి’ ఆధ్యాత్మిక వేడుకలు అభినందనీయమని రాష్ట్ర వీరశైవ లింగాయతి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రతి హిందువులో బసవతత్వం గురించి అవగాహన పెరగాలని అందరూ ధర్మం వైపు నడవాలని పేర్కొన్నారు. అదే విదంగా ఏప్రిల్ 20 న జరగబోవు బసవన్న ర్యాలీను హిందూ మరియు వీర శైవ బంధువులందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.

