కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సిరి ని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర అధ్యక్షులు ఎంసీ కాశన్న ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. కర్నూలు నగర సంఘ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా హడా కమిటీ చైర్మన్ నాగరాజు మరియు జిల్లా కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి నగర కార్యదర్శి ఎం రామకృష్ణ, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందన, ఆంధ్రప్రదేశ్ టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు నరసింహులు, వెటర్నరీ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆదోని తాలూకా కార్యదర్శి బజారీ, కర్నూల్ నగర కార్యవర్గం హరికృష్ణ గౌడ్, సాయిరాం, విజయ్ కృష్ణ, వరలక్ష్మి, చలపతి, ప్రవీణ్ కుమార్, నరసయ్య, సుజాత, శ్రీరాములు, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

