వ్యాధుల పైన అవగాహన
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్. రాహుల్ ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు ప్యాపిలి 2 వ సచివాలయం ను సందర్శించి వివిధ వ్యాదుల పైన అవగాహనా కల్పించి,స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ను గురించి తెలుపుతూ ఈ నెల 17 వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేది వరకు (ఎన్ సి డీ 4.0 సర్వే) గర్భిణీ స్రీ లు, భాలింతల కు పరీక్షలు మరియు హెమోగ్లోబిన్,హైపర్ టెన్షన్, డయబేటిక్,కాన్సర్ లకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 20 వ తేదిన అన్నీ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్రీ లను, భాలింత లను,కిశోరి బాలికలు, మహిళలు, హైపర్ టెన్షన్, డయబేటిక్, కాన్సర్, సికిల్ సెల్ అనీమియా, టి బీ,ఇతర వ్యాదులు వున్నా వారిని 24 వ తేదిన ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో జరిగే మెగా ఆరోగ్య క్యాంపు కు పంపవలెను,ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ లు పరీక్షలు, స్క్రీనింగ్ చేసి, కౌన్సిలింగ్, చికిత్స చేసి అవసరం అయిన వారిని రెఫెర్ చేయడం జరుగుతుంది.ఈ సదవ కాసమును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుమతి దేవి, ఏ ఎన్ ఎం రమాదేవి అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

