NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక

1 min read

అధ్యక్షుడిగా శరభయ్య,ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు..

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శరభయ్య మరియు ప్రధాన కార్యదర్శిగా లాయర్ బి.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది వెంకటరాముడు అన్నారు.శనివారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీలో ఎవరూ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆయన తెలిపారు.వీరితో పాటు ఉపాధ్యక్షులుగా బి.కేశాలు,జాయింట్ సెక్రటరీగా వి అరుణ్ కుమార్, మహిళా ప్రతినిధిగా విజయలక్ష్మి ఎన్నిక అయినట్లు వెంకట రాముడు తెలిపారు.వీరిని మిత్రులు శ్రేయోభిలాషులు శాలువా పూల మాలలతో ఘనంగా సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

About Author