NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి

1 min read

రాష్ర్ట ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు : తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని, మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో నిత్య నూతన వెలుగులు నింపి, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, చిరునవ్వులతో, సిరి సంపదలతో తులతూగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తూ ముందుకు   సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన   రాష్ట్ర ప్రజలందరికీ భోగి – సంక్రాంతి – కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు.

About Author