NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో కల్తీ ఆహార పదార్థాలకు చెక్​..

1 min read

నిషేధిత రంగు కలిపిన బఠాణీ, గోబిమంజూరియా, షుగర్​ క్యాండిల్​ తొలగింపు

  • ఫుట్​ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలతో  బెంబేలెత్తిన హోటళ్ల యజమానులు

కర్నూలు  , న్యూస్​ నేడు:శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వెలిసిన శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆహార భద్రత శాఖ డైరెక్టర్​,  ఆహార భద్రత జిల్లా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఆహార భద్రత అధికారి కర్నూలు రాజగోపాల్​ రావు   విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ వైపు వెళ్లే రహదారిలోని హోటళ్లు, బస్టాండ్ ఆవరణంలోని హోటళ్లు, గోబి మంజూరియా, బఠాణి షాపులను పరిశీలించారు. నిషేధిత రంగు కలిపిన బఠాణీలు కొందరు విక్రయిస్తుండగా…సింథటిక్​ రంగు కలిపిన గోబి మంజూరియా, షుగర్​ క్యాండిల్​ విక్రయించే వారు, కాల్చిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించే వారిని గుర్తించి… వారి నుంచి బఠాని, గోబి మంజూరియా, షుగర్​ క్యాండిల్​ను చెత్త బుట్టలో వేయించారు. దీంతో శ్రీశైలంలోని  హోటళ్ల యజమానులు, తినుబండారాలు విక్రయించే వారు, గోబి మంజూరియా యజమానులు ఆందోళనకు గురయ్యారు.  భవిష్యత్​ లో కల్తీ ఆహారం, కలుషిత నీరు ఎవరు విక్రయించినా చర్యలు కఠినంగా తీసుకుంటామని  ఆహార భద్రత అధికారి కర్నూలు రాజగోపాల్​ రావు ఈ సందర్భంగా హోటళ్లు, గోబి మంజూరియా యజమానులను హెచ్చరించారు.

About Author