శ్రీశైలంలో విస్తీత తనిఖీలు
1 min read

గోబి మంజూరియా, రంగు కలిపి బఠాణీల గుర్తింపు
- కర్నూలు ఆహార భద్రత అధికారి రాజ గోపాల్ రావు
శ్రీశైలం , న్యూస్ నేడు:ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆహార భద్రత ఉన్నతాధికారి , కమిషనర్, రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల మేరకు శ్రీశైలంలో ఆహార భద్రత అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం గోబి మంజూరియా, చిరుతిండ్ల బండ్లు, హోటళ్లపై కర్నూలు ఆహార భద్రత అధికారి రాజగోపాల్ రావు పరిశీలించారు. గోబీ మంజూరియాలో నిషేధిత రంగు కలిపిన పదార్థాలు, రంగు కలిపి బఠాణీలను ప్రజలకు విక్రయిస్తున్నారని గుర్తించి… వాటిని చెత్త బుట్టలో పడేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి రాజ గోపాల్ రావు మాట్లాడుతూ సింథటిక్ పదార్థాలు , రసాయనాలు కలిపిన ఆహారం, బఠాణీలు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిదంగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని ఆదేశించారు. శ్రీశైలంలోని పాతాళ గంగకు వెళ్లే రహదారిలో రుద్రప్ప హోటలు, అయ్యన్న హోటలు, ఎస్బిఎంఎస్ ఫుడ్ కోర్టు , రమేష్ హోటల్ లో పరిశీలించగా గోబిమంజూరియా లో సింథటిక్ రంగు కలిపారని, రంగులు కలిపిన బఠాణీలు విక్రయిస్తున్నారని, వాటిని గుర్తించి చెత్త బుట్టలో పడేశామని ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి రాజ గోపాల్ రావు వెల్లడించారు.


