NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ మెడికవర్ ‘ లో..చిల్డ్రన్స్ డే సందడి

1 min read

పిల్లలతో కేక్ కట్ చేయించిన వైద్యులు

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : మెడికవర్ హాస్పిటల్, కర్నూలులో చిల్డ్రన్స్ డే ని సందడి వాతావరణంలో జరుపుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఈ రోజును ప్రత్యేకంగా మార్చేందుకు పలు వినోదాత్మక, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. కేరమ్స్, డ్రాయింగ్, కలర్ ఫిల్లింగ్, చెస్ వంటి ఆటలు చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయించాయి. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో హాస్పిటల్ వాతావరణం ఆనందభరితంగా మారింది.కార్యక్రమం అనంతరం చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేసి వారికి ప్రోత్సాహాన్ని కలిగించారు. చిన్నారులతో కలిసి చేసిన ఈ వేడుక చివరగా కేక్ కట్టింగ్ కార్యక్రమంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ & నియోనటాలజిస్ట్ డా. కె. సింధూరా రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ వై గణేష్, పీడియాట్రిషియన్లు డా. అనుష మరియు డా. మమత మరియు క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.పిల్లల ఆరోగ్యంతో పాటు వారి భావోద్వేగ శ్రేయస్సు కూడా అత్యంత ముఖ్యమని వైద్య బృందం ఈ సందర్భంగా పేర్కొంది. చిన్నారులకు సానుకూలమైన, భరోసానిచ్చే, స్నేహపూర్వక వాతావరణం కల్పించడంలో మెడికవర్ హాస్పిటల్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు తెలిపారు.

About Author