మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో షేక్షావలి స్వామి షషావళి స్వామి వారిని దర్శనం చేసుకొని అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం రచ్చబండ కార్యక్రమం ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అధ్యర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించారు..వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా *ఎల్లర్తి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నందు కోటి సంతకాలు నిర్వహించారు.ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


