స్వామిత్వ సంబంధించి గ్రామ సభలు పూర్తి చేయండి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కమిషనర్ పంచాయతీరాజ్ వారు రాష్ట్రంలోని అందరూ జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లు మరియు డిప్యూటీ ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి. ఈ క్రింది ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. టాక్స్ కలెక్షన్ ను కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే చేయవలసినదిగా, మ్యాన్యువల్ గా కలెక్ట్ చేయకూడదని ఆదేశించారు.టాక్స్ కలెక్షన్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేయవలసినదిగా ఆదేశించారు. స్వామిత్వ సంబంధించి గ్రామ సభలు కూడా పూర్తి చేయమని ఆదేశించారు. స్వామిత్వ కు సంబంధించి వెక్టార్రైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశించి ఉన్నారు.

