NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో పాగాలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ .. జిల్లా ఎస్పీ

1 min read

శ్రీశైలం / నంద్యాల న్యూస్​ నేడు:    మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించబడనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.పాగా అలంకరణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తుల రాకపోకల మార్గాలను, భద్రతా చర్యలను కలెక్టర్ మరియు ఎస్పీ సమగ్రంగా తనిఖీ చేశారు. దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సక్రమమైన మార్గదర్శకాలు, తాగునీటి సౌకర్యం, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకంగా పాగాలంకరణ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలపై పోలీసు శాఖతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. భక్తుల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలు అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, రెవెన్యూ, పోలీసు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author