NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

  • కర్నూలు జేఏసీ చైర్మన్​ సతీష్​ కుమార్​

కర్నూలు, న్యూస్​ నేడు: విద్యుత్​ సంస్థలలో పని చేసే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కర్నూలు జేఏసీ చైర్మన్​ సతీష్​ కుమార్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం నగరంలోని కర్నూలు సర్కిల్​ ఆఫీస్​ విద్యుత్​ భవన్​ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్​ ఉద్యోగుల కర్నూలు జేఏసీ  చైర్మన్​ సతీష్​ కుమార్​ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25వేల మందికి పైగా కాంట్రాక్ట్​ పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారందరికీ గౌరవ వేతనం ఇవ్వాలని, వారిని వెంటనే రెగ్యులర్​ చేయాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా గ్రేట్​ –2 జూనియర్​ లైన్​ మ్యాన్​ పూర్తిగా విద్యుత్​ శాఖలో విలీనం చేయాలని, విద్యుత్​ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు.  అంతేకాక పెండింగ్​ డీఏ లను వెంటనే ప్రకటించాలని డిమాండ్​ చేశారు. ఈ నెల 15,16న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామని, 17,18న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపామని, గురు, శుక్రవారంలో రిలే నిరాహార దీక్ష చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్​ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేపడతామన్నారు. నిరసన దీక్ష లో  విద్యుత్​ ఉద్యోగుల  నాయకులు బెళగల్​ హుసేని, నాగ శేషులు,  సయ్యద్​ మున్వుర్​ బాష, దేవ కుమార్​, రజజినికాంత్​, ఈశ్వర్​, నబీ రసూల్​, షఫీ అహ్మద్​, రఫీ, మధు కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

About Author