సమగ్ర భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు మన దేశ ఐక్యతకై పాటుపడాలి
1 min read

– నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశపు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని స్థానిక నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నేషనల్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికిపూలమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

